Saturday, 27 August 2011

అమ్మ ఒడిలోకి పయనం (ఒక అమెరికా స్వామి ఆత్మకథ )


చికాగో నుంచి భరతమాత ఒడికి....
‘సమస్యల సుడిగుండంలో చిక్కుకుని..దారీ తెన్నూ తెలియక సతమతమయ్యే నేటి యువతకు వెలుగు రేఖను చూపి ఆ వైపు పయనింపచేసే అక్షర చుక్కాని ‘అమ్మ ఒడిలోకి పయనం’ గ్రంథం. ధనం, ఐశ్వర్యం, విలాస వస్తువులతో భోగభూమిగా ప్రసిద్ధికెక్కినా.. అమెరికాలో పుట్టినా.. వాటిని అనుభవించే యవ్వనంలో అడుగు పెట్టినా..అన్నింటినీ తృణీకరించి, ఆధ్యాతిక సాహస యాత్ర చేసిన నవయుగ పాశ్యాత్య యువ యోగి ఆత్మకథ ఇది...‘ది జర్నీ హోమ్‌’ పేరుతో రాధానాథ్‌ స్వామి ఆంగ్లంలో రచించిన గ్రంధాన్ని వారి శిష్యులు యుగళ కిశోర్‌దాస్‌ తెలుగులోకి అనువదించిన ‘అమ్మ ఒడిలోకి పయనం- అమెరికా స్వామి ఆత్మకథ’ పుస్తకాన్ని మార్చి ౨౮, ౨౦౧౧ న హైదరాబాద్‌ శిల్పకళావేదికలో మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య ఆవిష్కరించారు . 

రిచర్డ్‌ ఆధ్యాత్మిక సాహసయాత్ర
Radhanath-Swamiజీవితానికి ఒక అర్థాన్ని, పరమార్ధాన్ని సాధించాలనే తపనతో ఒక అమెరికా యువకుడు చేసి అన్వేషణకు అక్షరాకృతే ఈ గ్రంధం.నాగరికత ముసుగులో అతికించుకున్న నవ్వుతో.. ఆ వి శ్వాసం తాండవించే ఆధునిక అసహజ జగత్తులో విసిగివేసారిన ప్రతి యువకునికీ ఈ గ్రంథం చక్కటి కరదీపిక. ౧౯౭౦ లలో భార తీయ యువత భోగదృష్టితో అమెరికా వైపు పరుగులు తీస్తూ ఉంటే రిచర్డ్‌ అనే అమెరికా యువకుడు ఆధ్యాత్మిక దృష్టితో ప్రాణాల కు తెగించి నదులు, పర్వతాలు, అరణ్యాలు, జీవారణ్యాలు, దేశాలు, ఖండాలు దాటి భారత భూమివైపు పయనించడం ఒక అద్భుతం.

ఆ యువకుడు కాలేజీ సెలవుల్లో స్నేహితులతో కలిసి యూరోప్‌ వెళుతున్నానని ఇంట్లో చెప్పి బయలుదేరాడు. కొద్దిరోజుల్లోనే యూరోప్‌ యాత్ర, డబ్బు అయిపోయాయి. కానీ ఆధ్యాత్మిక తృష్ణ మాత్రం తీరలేదు. క్రీట్‌ ద్వీపంలో ఒక కొండ శిఖరం మీద ధ్యానం లో ఉన్నపుడు ఆయనకు ‘భారత దేశానికి వెళ్లు’ అనే మధుర గం భీర స్వరం వినిపించింది. అంతే అత్యంత ప్రియ మిత్రుడయిన ‘గేరి’ని కూడా వదిలి ముందుకు సాగాడు. కలరా వ్యాపించి ఉన్న ‘టర్కీ’లో కాలినడకన ప్రయాణం చేస్తూ ఇరాన్‌ ఎడారుల గుండా అప్ఘనిస్తాన్‌, పాకిస్తాన్‌ జనావాసాల మధ్య అపరిచిత వ్యక్తుల ప్రేమ, ద్వేషాల మిశ్రమానుభూతితో చేతిలో పైసా లేకుండా పరమా త్మనే నమ్ముకుని చివరకు భారత దేశ సరిహద్దు చేరాడు. అక్కడ సరిహద్దు రక్షక దళ అధికారి ‘మా దేశంలో చాలామంది ముష్టివా ళ్లు ఉన్నారు..

booksమాకు వేరొక వ్యక్తి అక్కర్లేదు..’ అంటూ ఆయనను భారతదేశంలోకి అడుగుపెట్ట నివ్వలేదు. అప్పుడు ఆయన మరొక అధికారికి ‘ఏదో ఒక రోజు భారతదేశ ప్రజలకు మేలు చేస్తానని వా గ్దానం చేసి ఇమ్మిగ్రేషన్‌ అధికారులను ఒప్పించి మరీ భరతమాత ఒడిలోకి చేరుకున్నారు రిచర్డ్‌. ఇక భారతీయ ఆధ్యాత్మికతత్వాన్ని అర్థం చేసుకునేందుకు ఆయన చేసింది భగీరథ ప్రయత్నమే. హిమాలయాల్లో తట్వాలాబాబా, నాగబాబాల వంటి అనేకమంది బాబాలని, ఆనందమయి మాత, మదర్‌తెరీసా వంటి మాతృమూర్తులను సందర్శించాడు.జిడ్డు కృష్ణమూర్తి, దలైలా మా వంటి మహాత్ములతో సంభాషించారు. కొత్త ప్రదేశాల్లో కొత్త ఆచార వ్యవహరాలతో తిం డికి, గుడ్డకు, నివాసానికి ఎంత ఇబ్బంది పడు తున్నా వాటిని అధిగమించిన ఆయన అన్వే షణ ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ గ్రంథంలోని ఈ భాగమంతా భారతదేశంలోని విభిన్న ఆ ధ్మాత్మిక మార్గాల సంగ్రహ స్వరూపంగా ఒకే చోట దర్శనమిస్తుంది. 

జీవితంలో పెద్ద మలుపు...
హిమాలయాల్లోని గంగా ప్రవాహంలో ఆయనకు ‘హరే రామ హరే కృష్ణ’ మహామంత్రం వినిపించడం మరొక అద్భుతం. తరు వాత వృందావన యాత్ర రిచర్డ్‌ జీవితాన్ని నిజమయిన ‘రుషి’గా ఒక పెద్ద మలు పు తిప్పింది. కానీ బృందావ న యాత్ర తరు వాత శ్రీప్రభుపాదులవారు ‘రిచర్డ్‌’ కిగురువయ్యారు. తేలికగా ఎవ రినీ గురువుగా అంగీకరించని ఆ యన పట్టుదల యువతకు చక్కని హేతుబద్ధమైన మార్గదర్శనం చేస్తుంది. ఆ రిచర్డే ఇప్పుడు రాధా నాధ స్వా మిగా ఆంగ్లంలో ‘ ది జర్నీ హోమ్‌’ పేరుతో ఆత్మకథను రాశారు. ఇది ఒక ఆధ్యాత్మిక నవల. ఇందులో కష్టాలు, కన్నీళ్లు, ఆప్యాయతలు, ఆదరణలు వంటి హృదయోద్వేగాలు, వాటిని సరైన మార్గంలోకి మళ్లించే మంచి మనసులు అన్నీ ఉన్నాయి. ఆ త్మకథలు ప్రపంచ సాిహ త్యంలో ఎన్నో ఉన్నా ఇది నిజమైన ‘ఆత్మ’ కథ.

భక్తి విజ్ఞాన బోధన...
రాధానాధ్‌ స్వామి ౧౯౫౦ లో చికాగోలో జన్మించారు. యు క్త వయసులో తన ఆధ్మాత్మిక అన్వేషణలో భాగంగా ప్రపంచం అం తా సంచరించి చివరకు భక్తియోగ మార్గాన్ని అవలంభించారు. ప్రస్తుతం ఆయన ఆసియా, యూరప్‌, అమెరికాలలో పర్యటిస్తూ భక్తి విజ్ఞానాన్ని బోధిస్తున్నారు. కానీ తరచు ఆయనను ముంబా యిలో ఉన్న భక్త సమాజంలో చూడవచ్చు. రాధానాధ్‌ స్వామిని గురించి తెలిసిన వారు ఇతరులను భగవం తుని దరికి చేర్చడంలో ఆయనకు గల గొప్ప అంకితభావాన్ని కొనియాడుతారు. అదే స్థా యిలో ఆయన సరళత్వం, నిరాడంబరత్వం, హాస్యస్వభావం గురించి కూడా వివరిస్తారు. భక్త సమాజాల అభివృద్ధి, పేద విద్యార్ధులకు నిత్యాన్నదాన వితరణ, సమాజ సేవ లకు ఆసుపత్రులు, పర్యావరణ వ్యవసాయ క్షేత్రాలు, పాఠశాల లు, ఆశ్రమాల స్థాపన వంటి కార్యక్ర మాలకు ఆయన ప్రోత్సాహం ఇచ్చి నడిపిస్తున్నారు. 

Rel
యుక్త వయస్సు లో శ్రీ రాదా నాద్ స్వామి

అన్ని ప్రముఖ పుస్తక దుకాణాలలో దొరికే ఈ పుస్తకం వెల ౧౫౦/-

.

No comments:

Post a Comment